Saturday, July 15, 2006

"ఆత్మ"జ్ఞానం

మనలో ప్రతివారికీ "నేను" అనే భావనను గురించిన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ "నేను" అనేది ఏమిటి? ఇలా అనుకుంటున్నదెవరు? ఈ ప్రశ్నలు మన ఆత్మకు సంబంధించినవా? నాకూ, ఇతరులకూ ఉండే తేడాలెటువంటివి? మనలో ప్రతి ఒక్కరికీ ఆత్మ అనేది ఉంటుందా? ఈ భావాలకు మూలం ఏమిటి? ఇలాంటి సందేహాలు తలెత్తడం సహజమే. వయస్సు పెరిగి, జీవితంలో చేదు అనుభవాలు ఎదురైనప్పుడో, సమీప వ్యక్తుల నిరాదరణకు గురి అయినప్పుడో మనం జీవితంలోనూ, సమాజంలోనూ ఏకాకులం అనే భావన కలుగుతుంది. ఇలాంటి వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు మనం శారీరకంగానూ, మానసికంగానూ ఇంకెవరితోనూ ప్రత్యక్ష సంబంధం లేనివారమనేది అవగాహనకు వస్తుంది. శారీరక బాధలవంటి వాటికి గురయినప్పుడు మనం విలవిలలాడతాం కాని ఇతరులకేమీ అనిపించదు. ఎంత ఆత్మీయులతోనైనా కష్టసుఖాలు పంచుకోవడం అనేది మానసికంగా మాత్రమే సాధ్యం. ఎవరి మెదడూ, నాడీవ్యవస్థా వారివే. వేల ఏళ్ళుగా సమాజజీవితం అలవాటైన మనుషులకు ఒంటరితనం గొడ్డలిపెట్టులా అనిపించవచ్చు. అలాంటి మానసిక స్థితిలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ మొదలైనవాటికి అర్థం ఉన్నట్టుగా అనిపించడం సహజం. దాంతో బాహ్యప్రపంచంతో సంబంధం లేనటువంటి ఏదో ప్రత్యేక అస్తిత్వం గురించిన అపోహలు మొదలవుతాయి.

తమను గురించి తాము వ్యక్తిపరంగానూ (సబ్జెక్టివ్‌), వస్తుగతంగానూ (ఆబ్జెక్టివ్‌) కూడా ఆలోచించగలిగే శక్తి మనుషులకు మాత్రమే ఉంటుంది. అలోచనల లోకంలో వారే విహరించగలరు. అలాగే మనుషులకు జీవితంలో ఎదురయే సమస్యలన్నిటికీ దాదాపుగా ఆలోచనలే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం. ఎందుకంటే మరే జంతువుకూ ఉండనంత సంక్లిష్టమైన స్థాయిలో మనుషులు మానసిక జీవితం గడుపుతారు. ఇందులో స్వీయానుభవాలదే అగ్రస్థానం. స్వ, పర భేదాలు ఆరంభమయేది ఎప్పుడో ఎవరికీ గుర్తుండదు. మన ఉనికికీ, వ్యక్తిత్వానికీ మాత్రం ఇదే ఆధారం. ఇది ఎప్పుడు, ఎలా మొదలవుతుంది? "నేను, నా" అనే భావనలు పుట్టిన వెంటనే కాకపోయినా త్వరలోనే ఏర్పడతాయి. ఇందులో జరిగేవన్నీ, భౌతిక, శారీరక పరిణామాలే. పుట్టినప్పుడు తెల్ల కాయితంలా ఉన్న మన మెదడు ఆ తరవాత శరవేగంతో అనుభవాలను పొంది, ఎదగడం ఆరంభిస్తుంది. పెద్దయాక మన తెలివితేటలకూ, అనుభవజ్ఞతకూ, అవివేకానికీ కూడా ఈ ఎదుగుదలే కారణం అవుతుంది. ఊహ తెలియనప్పుడే మన పంచేంద్రియాలు పనిచెయ్యనారంభిస్తాయి. నేర్చుకోవడమంటే ఏమిటో మెదడు ముందుగా నేర్చుకోవడం మొదలుపెడుతుంది. సహజంగా అందరి విషయంలోనూ జరిగేదే కనక ఇదేమీ ప్రత్యేకంగా అనిపించదు. కానీ మన జీవితంలో సుమారు నాలుగోవంతు గడిచేదాకా ఎదిగే మెదడు ప్రాణికోటిలో ప్రత్యేకమైనది. మనుష్యులు మానసికంగా అపరిపక్వదశలో గడిపినంత వ్యవధి మరే జంతువూ గడపదు. ప్రపంచాన్ని గమనించి నేర్చుకునేది అన్నిటికన్నా ముఖ్యమైనది కనక పసి పిల్లలు అదేపనిగా తమ చేతి వేళ్ళకేసి చూసుకుంటూ, వస్తువుల మధ్య దూరాన్ని పసికట్టడం క్రమంగా నేర్చుకుంటారు. ఎందుకంటే మన కన్ను కేమెరాలాగా మూడు కొలతల ప్రపంచాన్ని రెండు కొలతల "తెర"పై చూపుతుంది. రెండు కళ్ళ స్టీరియో విజన్‌ సహాయంతో ఊహ తెలియక మునుపే ఎదురుగా ఉన్న వస్తువుల మధ్య ఎంత ఎడం ఉందో క్రమంగా మనకు తెలుస్తుంది. వినికిడి, వాసన, స్పర్శ వగైరాల ద్వారా అందే సమాచారాన్ని కూడా మెదడులోని ఒక్కొక్క భాగమూ ఎలా స్వీకరించాలో, ఎలా సమన్వయం చేసుకోవాలో నేర్చుకుంటుంది. ఎందుకంటే వస్తుగత యదార్థత ఉండేది వాస్తవ ప్రపంచానికే. ప్రాణులు తమ అవసరాలని బట్టి కావలసిన అవగాహనను పెంపొందించుకుంటాయి. ఆధ్యాత్మిక ధోరణిలో పడ్డవారికి ఇలాంటి విషయాలు తట్టవు కనక గోరంతల్ని కొండంతలుగా ఊహించుకుని ఆందోళన పడుతూ ఉంటారు.

నిజానికి మనిషి తల్లి కడుపులో పిండ దశలో ఉండగానే చైతన్యం, స్పృహ అనేవి ప్రాథమిక స్థాయిలో మొదలవుతాయి. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇవి ఎక్కువై, వ్యక్తిగత, వస్తుగత యదార్థతలకు తేడా లేకుండా పోతుంది. స్పృహ, చైతన్యం, ఆత్మజ్ఞానం మొదలైనవన్నీ తక్కిన ప్రాణులలాగే చిన్నతనంలో మన మెదడుకూ, పరిసరాలకూ మధ్య నిరంతరం జరిగే ప్రక్రియల ద్వారా క్రమంగా ఏర్పడతాయి. మెదడులోని ఆలోచనలకూ, బాహ్యప్రపంచానికీ ఉన్న తేడాలు అర్థం అవడం మొదలుపెట్టాక మనుషులకు తమ చైతన్యం చాలా ప్రత్యేకమైనదిగా అనిపించనారంభిస్తుంది. మన భావనలూ, ఉద్దేశాలూ, ఆవేశాలూ ఏవీ కూడా మాటలూ, చేతల ద్వారా తప్ప ఇతరులతో పంచుకోలేమని తెలిసినప్పటినుంచీ "అహం", "ఆత్మ" మొదలైనవాటి గురించిన తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి. నిప్పు వల్లా, నీటి వల్లా ఇతర వ్యక్తులకూ, జంతువులకూ కూడా మనవంటి స్పందనలే కలుగుతాయనేది తెలిసినా కూడా చాలామందికి తగినంత వివేకం ఏర్పడదు. అందుకనే వ్యక్తిగత భావాల్లో ఉండే తేడాలను గురించి ఉన్నవీ, లేనివీ కల్పించుకుని, తమలో ఏదో ఆత్మ ఉందనీ, అది మరణానంతరం కూడా కొనసాగుతుందనీ ఏవేవో ఊహించుకుంటారు. శిశువులు ఒక దశలో అద్దంలో కనబడే తమ ప్రతిబింబాన్ని చూసి మరెవరో అనుకుంటారు. అలా అతి ప్రాథమిక స్థాయిలో మొదలయే మన అవగాహన "ముదిరి", ప్రకృతి మాయ అనీ, పురుషుడే యదార్థమనేంత దాకా పోతుంది. వాస్తవ ప్రపంచం కన్నా దాన్ని గురించిన అవగాహనే ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. ఈ వేదాంత ధోరణికి బీజాలన్నీ మన మెదడులోనే ఉంటాయి. పుట్టుకతో సంక్రమించని "ఆత్మ" అనే భావన చచ్చిపోవడంతోనే పోతుందని చాలామందికి నమ్మబుద్ధి కాదు. మతాలన్నీ ఈ బలహీనతలను ఉపయోగించుకుంటాయి.

ఆత్మ వగైరాల గురించిన నమ్మకాలు యూదులనుంచీ అనేక మతాలవారిలో ఉన్నాయి. హేతువాదం కూడా మొదటినుంచీ ఉన్నదే. మన దేశంలో ఇలాంటి విషయాల్లో సరైన అవగాహన కలిగినవారు చార్వాకుల నాటి నుంచీ ఉన్నారు. బుద్ధుడూ, మహావీరుడూ మొదలైనవారికి సమకాలికుడుగా భావించబడుతున్న అజిత కేశకాంబలి అనే తత్వవేత్త ఒక సందర్భంలో ఇలా అన్నాట్ట. "ఓ రాజా, దానధర్మాలూ, యజ్ఞబలులూ మొదలైనవాటి వల్ల పుణ్యమేమీ కలగదు. సత్కార్యాలో, దుష్కృత్యాలో చేసినంత మాత్రాన నీవనుకున్న ఫలితాలేవీ కలగవు. ఇహ, పరలోక జీవితాలనేవి ఉండవు. తల్లిదండ్రులనేవారు లేకుండా సంతానం కలగదు. ముక్తిని పొందిన ఋషులూ, బ్రాహ్మణులూ ఎవరూ లేరు. ఇహ పరాలనూ సాధించినవారూ, అటువంటి జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వగలిగినవారూ లేరు. మనుషులందరూ నాలుగు ధాతువులతో రూపొందారనే దొక్కటే సత్యం. చనిపోయాక వారిలోని మట్టి మట్టిలో కలిసిపోతుంది. ద్రవాలన్నీ నీరుగానూ, వేడిమి అగ్నిగానూ మారిపోయి, ఊపిరి గాలిలో కలిసిపోతుంది. వారి చైతన్యమంతా శూన్యం ఐపోతుంది. బతికున్న నలుగురు చచ్చినవాణ్ణి పాడె గట్టి మోసుకెళుతూ, శ్మశానం చేరేదాకా వాణ్ణ్ణి పొగుడుతారు. అక్కడికి చేరాక వాడి ఎముకలు సున్నంలోనూ, వాడిచ్చిన నైవేద్యాలూ, చేసిన పుణ్యకార్యాలూ అన్నీ బూడిదలోనూ కలిసిపోతాయి. బలులూ, నైవేద్యాల గురించి చెప్పేవారు మూఢులు. వాటివల్ల పుణ్యం కలుగుతుందనడం అర్థం లేని మాట. మూఢులూ, జ్ఞానులూ అందరూ కూడా శరీరాలు నశించాక, తక్కినవారితో తెగతెంపులై, నాశనమైపోతారు. బతికున్నప్పటిలాగా ఉండరు".

పంతొమ్మిదో శతాబ్దంలో యూరప్‌లో క్రైస్తవ మత భావనల మూఢ విశ్వాసాలు కొంత బలహీనపడడంతో భౌతికవాదం స్పష్టంగా రూపొందసాగింది. జ్ఞానమైనా, విజ్ఞానమైనా పరిశీలనలూ, నిరూపించగలిగిన పరిశోధనల మీదనే ఆధారపడాలి కాని నిరాధారమైన నమ్మకాల మీద కాదనే ధోరణి పెరిగింది. ఈ నాటి విజ్ఞానం ప్రతి ఆలోచననూ, మనోభావాన్నీ విశ్లేషించి, వాటికి దారితీసే జీవరసాయనిక ప్రక్రియలను వివరించగలిగిన పరిస్థితికి చేరుతోంది. ఈ రకమైన చైతన్యమూ, అవగాహనా నాడీమండలం, సంక్లిష్టమైన మెదడూ ఉన్న మనుషుల వంటి కొన్ని ప్రాణులకే పరిమితం అని తెలుస్తోంది. అవసరాలని బట్టి జీవపరిణామంలోని కొన్ని దశల్లో బుద్ధి వికాసం అనేది కొన్ని ప్రాణులకు "తలవనితలంపుగా" జరిగింది. ఈ పరిణామాలకు గురి అయిన జీవాలకు మనుగడ ఎంత ముఖ్యమో అవగాహనా అంతే ముఖ్యం. ఇది ప్రాణులన్నిటికీ వర్తించదు. బాక్టీరియావంటి జీవాలకు నాడీవ్యవస్థ ఉండదు. ఆలోచనలూ, భావనలూ లేకపోయినా అవన్నీ కొల్లలుగా పెరుగుతూ, ప్రతిచోటా కనిపిస్తాయి. ఎంతో విజయవంతంగా వర్ధిల్లుతున్న ఈ "బుద్ధిలేని" ప్రాణులన్నీ మనకన్నా హీనమైనవి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఏవో అయోమయపు అపోహలతో ఆత్మలనూ, పునర్జన్మనూ నమ్ముతూ ప్రతిపాదనలు చేసేవారికి, కనీసం మనకు కనబడుతున్న జీవాలన్నిటికీ వర్తించే సూత్రాలను అన్వేషించాలనే వివేకం కూడా ఉండదు. అచ్చగా వ్యక్తిగతమైన ఊహలనూ, ప్రేరణలనూ ఆధారం చేసుకుని సృష్టి "రహస్యాల" గురించి వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. విజ్ఞానపరంగా ప్రస్తుతం వివరించలేని విషయాలేవైనా దొరకగానే వీళ్ళకు ఆవేశం వచ్చేస్తుంది. ఉదాహరణకు ఇటీవలి దాకా ఆత్మ శరీరం నుంచి వేరయి తమ శరీరాన్ని తామే చూసినవారి అనుభవాలగురించి తర్జన భర్జన జరిగింది. ఔట్‌ ఆఫ్‌ బాడీ అనుభవాలనబడే ఈ సంఘటనలను మళ్ళీ పరిశోధించారు. తీరా చూస్తే ఇందులో అతీతశక్తి ఏమీ లేదనీ, మెదడులోని ఒక భాగాన్ని స్పృశించినప్పుడు అటువంటి భావనలు కలుగుతాయనీ వెల్లడయింది.

మనం గుర్తుంచుకోవలసిన దేమిటంటే నిన్న మొన్నటిదాకా అంటురోగాలూ, తుఫానులూ, భూకంపాలూ కలిగినప్పుడల్లా ఏ తోకచుక్కనో చూసి బెదిరిన మానవజాతి మనది. ఆధునిక స్వాములు వీటన్నిటికీ పాత నమ్మకాలను ప్రచారం చేస్తే జనం తాటాకులు కట్టేస్తారు గనక జాగ్రత్తపడి ప్రస్తుతం సందిగ్ధంగా అనిపించే విషయాల గురించే బోధలు చేస్తూ ఉంటారు. బీదవారినీ, దారిద్య్రాన్నీ చూసి చలించిన కొందరు సంపన్నులకు కలిగే భయాందోళనలకూ, వారిని బాధించే అంతరాత్మల క్షోభకూ ఉపశమనం కలగడానికి శ్రీశ్రీరవిశంకర్‌ వంటి గురువులు వారి కోసం సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. సామాజిక అసమానతలవల్లా, నగ్నంగా తాండవం చేస్తున్న దుర్మార్గపు వ్యవస్థ కారణంగానూ తలెత్తే సమస్యలన్నిటికీ ఈ బోధకులు ఆధ్యాత్మిక పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు. కేవలం ఆర్థిక శక్తులవల్ల కలిగే కుటుంబ సంక్షోభాన్నీ, వ్యక్తిగత వైరుధ్యాలనూ గుర్తించలేనివారంతా ఈ రకమైన షార్ట్‌కట్‌ పద్ధతులను అన్వేషిస్తూ ఉంటారు. మన సనాతనులు ఆత్మలూ వగైరాల గురించి చెప్పినవాటిలో వీరికి కొంత నిజం కనిపిస్తూ ఉంటుంది.

మైక్రోస్కోప్‌ కనిపెట్టినదాకా సూక్ష్మజీవుల గురించి ఎవరికీ తెలియనుకూడా తెలియదు కనక ప్రాచీనులకు జీవకోటిలోని వైవిధ్యం గురించి ఇంతగా అవగాహన లేదు. ప్రతి జీవానికీ ఆత్మనూ, పునర్జన్మనూ ఆపాదిస్తూపోతే ఎంత అయోమయంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. క్రీస్తుకు అయిదువందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు జన్మరాహిత్యం గురించి ఊహించాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అలా ఎవరైనా ఆలోచిస్తే అది బుద్ధిరాహిత్యమే! ఇప్పటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో వెనక్కు వెళ్ళి తెలుసుకోవడం ఈ వ్యాసాల ఉద్దేశం. ఉదాహరణకు మనిషికి మెదడే ప్రత్యేకం. ఇది ఎలా రూపుదిద్దుకుందో తెలియాలంటే ఇతర వానరాల, క్షీరదాల, జంతువుల గురించీ వాటి పరిణామం జరిగిన పద్ధతి గురించీ తెలుసుకోవాలి. ఇంకా వెనక్కు వెళ్ళి, మొదటి జలచరాలూ, బహుకణ ఏకకణ జీవులూ ఎలా పుట్టాయో అన్వేషించాలి. చివరకు భూమీ, సూర్యుడూ, నక్షత్రాలూ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. మనకు తెలిసిన భౌతిక సూత్రాలేవీ అతిక్రమణకు లోనవకుండా జరిగిన ఈ పరిణామదశలన్నీ చూసినప్పుడు ఈ విశ్వం గురించిన "ఉద్దేశం" ఏదీ లేదనీ, ఇది ఎవరి "లీలా" కాదనీ అనిపించకమానదు. "పచ్చి" భౌతికవాదానికి తగిన ప్రత్యామ్నాయం లభించేదాకా హేతువాదులకు అది తప్ప మరో దారిలేదు. మన కళ్ళకు కనబడే ప్రపంచమూ, సంఘటనలే మనకు యదార్థం. మన శరీరానికి ఏ రాయో తగిలితే కలిగే బాధ వల్ల రాయి యదార్థత మరింత బాగాతెలుస్తుంది కూడా. స్పర్శ ద్వారానో, గాయంవల్లనో రాయి గురించి మనకు కలిగే అవగాహనతో రాతికి సంబంధమేమీ లేదు. చైతన్యం (కాన్షస్‌నెస్‌) ఉన్న ప్రాణులన్నిటికీ ఈ వ్యక్తిగతమైన (సబ్జెక్టివ్‌) అవగాహన ఉంటుంది. వస్తుపరమైన యథార్థత (ఆబ్జెక్టివ్‌ రియాలిటీ) అనేదానికీ, మన చైతన్యానికీ సంబంధం లేదని లెనిన్‌ అన్నాడు. మనుషుల ఉనికికి వారి చైతన్యం కారణం కాదనీ సమాజంలో వారి ఉనికి వల్లనే వారికి చైతన్యం ఏర్పడుతుందనీ మార్క్స్‌ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్‌ష్టయిన్‌ వంటి మేధావులు కూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.

పదార్థమూ, జీవపదార్థమూ ఎలా పరిణామం చెందాయో తెలుసుకుంటే ప్రాణులకు ఈ చైతన్యం ఎలా కలిగిందో అర్థమవుతుంది. మెదడూ, నాడీమండలమూ విపరీతంగా అభివృద్ధి చెందిన మనిషిిజాతికి ఈ అవగాహన అత్యున్నతస్థాయిలో ఉంటుంది. మన దేశపు వేదాంత ధోరణి అతిగా తలకు పట్టించుకుంటే మానసిక చైతన్యమే యథార్థమనీ, మనకు కనబడే లోకమంతా మిథ్య అనీ కొందరికి అనిపిస్తుంది.

ఎంతటి మిథ్యావాదులైనా మెదడు కూడా విశ్వంలోని పదార్థరాశిలో ఒక భాగమేనని ఒప్పుకుంటారు. మనసు, లేదా బుద్ధి అనేదానికి మెదడుతో సంబంధం లేదనే ఒక ప్రతిపాదన ఉంది. దీనికి ఇంతవరకూ సరైన రుజువేదీ దొరకలేదు. మెదడుకు "వెలపల" రూపొందిన భావనలేవీ కనబడవు. మెదడు గురించి నిరంతరంగా సాగుతున్న పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన నిజాలు బైటపడుతున్నాయి. మెదడులోని కోటానుకోట్ల నాడీకేంద్రాల మధ్య ప్రసారమయే ఎలక్ట్రిక్‌ సందేశాలూ, మెదడులో తాత్కాలికంగా విడుదల అయే రసాయనిక పదార్థాలూ రకరకాల భావనలు కలగజేస్తాయని తెలుస్తోంది. ఇదంతా సరిగ్గా అర్థం అయేలోపలే తొందరపడి పెద్ద ప్రతిపాదనలు చెయ్యడంవల్ల ఉపయోగం ఉండకపోగా మరింత అయోమయం పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రతిపాదనకు ఆధారాలన్నీ వ్యక్తిపరమైన భావనలే.
మెదడూ, కొన్ని రకాల ప్రాణులకు ఉన్న నాడీమండలమూ ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో రూపొందాయో విజ్ఞానం చెపుతుంది. ఈ సందర్భంలో 450కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన భూమి మీద మనుషులు పుట్టి 20 లక్షల సంవత్సరాలే అయిందని గుర్తుంచుకోవాలి. అంటే మనిషికి తన మెదడు ద్వారా లభిస్తున్న స్పృహ ఏర్పడని కోట్లాది సంవత్సరాల క్రితం నుంచీ పదార్థం (మేటర్‌) అనేది ఉంటూనే ఉంది. మనిషి మెదడులోని కణజాలం ఆలోచనకూ, జ్ఞాపకశక్తికీ, వివేచనకూ తోడ్పడుతుంది కాని అది కూడా పదార్థంతో రూపొందినదే. నిర్జీవపదార్థానికి వర్తించే భౌతికసూత్రాలన్నీ దానికీ వర్తిస్తాయి. విశ్వంలోజరుగుతున్న సంఘటనలను గమనిస్తే పదార్థం గురించిన అవగాహనకన్నా పదార్థమే ప్రాథకమికమైనదీ, మౌలికమైనదీ అని తెలుస్తుంది.

నిజమైన ఆధునిక సంస్కృతి, లేక కల్చర్‌ భౌతికశాస్త్రంవల్లనే కలుగుతుందని రిచర్డ్‌ ఫేన్‌మన్‌ అన్నాడు. ఈనాటికీ ప్రపంచంలోని మతాలన్నీ ఆటవికలక్షణాలతో నృత్యం చెయ్యడం చూస్తూంటే అది నిజమనిపించకమానదు. మూఢనమ్మకాలూ, వికృతమైన ఆచారాలూ, నిరూపించనవసరంలేని ప్రతిపాదనలూ ఈ మతాలకు ఆధారాలు. ఒకవంక సమాజాన్ని దోపిడీచేస్తూ దానికి గురి అయినవారి బలహీనతలని ఉపయోగించుకుంటూ అందుకు కారణాలని "పర"లోకంలోచూపించే మతప్రచారకులు ఎలాంటివారో మామూలుగా అందరికీ తెలియదు. రకరకాల జంతువుల తలల దేవుళ్ళతో కొన్ని మతాలూ, సంగీతమూ, కార్టూన్లూ తమకు విరుద్ధమనే మతాలూ, కష్టాలతో ప్రాణంమీదికొచ్చినవారిని దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమతో కాపాడతాడనే మతాలూ ఇలా ఎవరిదారినవారు ప్రజలని శాయశక్తులా భ్రమపెడుతూ ఉంటారు. ఇంతకన్నా"ఆధునిక" పద్ధతిలో అయోమయం సృష్టించే తత్వవేత్తలూ ఉన్నారు.
మతాల ప్రచారాన్నీ, ఆధ్యాత్మికవాదులనీ పక్కన పెడితే నిజమైన జీవపరిణామం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి నిజాయితీతో ప్రయత్నించవచ్చు. శాస్త్రపరిశోధనలు ఈ పద్ధతిలోనే జరుగుతూ వస్తున్నాయి. శాస్త్రీయంగా ఈ నాడు నిరూపితమైన సిద్ధాంతాలకి అడ్డుతగిలే ఫలితాలు ఎదురైనప్పుడల్లా ఆ సిద్ధాంతాలని మార్చుకోక తప్పదు. ఇందులో ప్రవచనాలని గుడ్డిగా నమ్మే ప్రసక్తి ఉండదు. ఐన్‌ష్టయిన్‌ అంతటివాడే మొదట్లో క్వాంటమ్‌ మెకానిక్స్‌ సూత్రాలని ఆమోదించలేదు. ప్రస్తుతం విజ్ఞానం పదార్థాన్నీ, వికిరణాలనీ (రేడియేషన్‌) విశ్లేషణ ద్వారా అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. విద్యుత్తుగల కణాలని పార్టిక్‌ల్‌ ఆక్సిలేటర్లలో పరిగెత్తించి ఒకదాని కొకటి ఢీకొనేట్టు చేసి విశ్వం ఆవిర్భావానికి దారితీసిన బిగ్‌ బేంగ్‌ పెద్ద పేలుడు పరిస్థితులను కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఆ విధంగా విడుదల అయిన విపరీతమైన శక్తివల్ల అతి తక్కువ జీవితకాలం కలిగిన కొన్ని సూక్ష్మకణాలు ఎలా ఉత్పత్తి అవుతాయో గమనించడం వీలవుతుంది. ఇప్పుడు కనబడుతున్న విశ్వాంతరాళంలోని పదార్థరాశికి ఇటువంటి లక్షణాలు ఎలా కలిగాయో ఈ పరిశోధనలవల్ల తెలిసే అవకాశముంది. బరువూ, విద్యుత్తూ కూడా లేని న్యూట్రినో కణాలూ, కంటికి కనబడని డార్క్‌ మేటర్‌ అనబడే "అదృశ్య" పదార్థరాశీ వగైరాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా "ఎందుకు" జరిగిందనేది పట్టించుకోకుండా "ఎలా" జరిగిందని పరిశోధిస్తున్నారు.

గట్టిగా ప్రయత్నిస్తే తప్ప కనబడని సంఘటనలు అంతరిక్షంలో ఎన్నెన్నో ఉన్నాయి. మహా ఉత్పాతం కలిగిస్తూ పేలిపోయే నక్షత్రాలూ, వాటినుంచి ప్రసారం అయే అతి తీక్షణమైన కిరణాలూ, ఎక్కణ్ణించి వస్తున్నాయో అంతుచిక్కని గామా, ఎక్స్‌ రేల ప్రసరణమూ, ఊహించరానంత దూరాన ఉండి, అతివేగంగా బొంగరాల్లా తిరిగే క్వేజార్లూ, పల్సార్లూ ఇలా వింతలెన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి తీవ్రతతో పోలిస్తే మనం వీటిని గమనిస్తున్నామో లేదో అనే విషయం ఏ మాత్రమూ అర్థంలేనిదిగా అనిపిస్తుంది. గమనికకు గురి అవుతున్న ఇవన్నీ ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుంటూ, గమనించడం అనే శక్తి మనకు అసలు ఎలా అబ్బిందో కూడా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు. దీనివల్ల మనకున్న అపోహలు చాలామటుకు తగ్గే అవకాశం కూడా ఉంది. మనిషి తన జీవితంలో రకరకాల భావాలకు లోనవుతాడు. వీటిలో ప్రేమ, జాలి, కోపం, దుఖం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి కాక కొన్ని సందర్భాల్లో దైవభక్తి, దివ్యానుభూతులు, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందం వంటి భావనలు కూడా కలుగుతాయి. వీటికి జాతి, మత, ప్రాంతీయ పరిమితులేవీ ఉన్నట్టు కనబడవు. వ్యవస్థీకృతమైన పెద్ద మతాలే కాదు, ఆదిమజాతి తెగలకు చెంది గ్రామదేవతలు వగైరాలను ఆరాధించేవారికి కూడా నిజంగా ఇలాంటి భావనలు కలుగుతాయనేది తెలిసిన విషయమే. భావాలన్నిటికీ కేంద్రం మెదడే అని భౌతికవాదుల నమ్మకం. ఇతర ఉద్రేకాలకు లోనయినప్పుడు మనిషి మెదడులో ఎటువంటి మార్పులు కలుగుతాయో పరిశోధనల ద్వారా తెలుసుకుంటున్న శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక భావనలు కలిగించే ప్రభావాన్ని కూడా పరిశీలించారు.

ప్రపంచంలో ఎక్కడైనా ఇలాటి భావనలకు కొన్ని లక్షణాలు సామాన్యం. వీటికి లోనయినవారికి కలిగే అనుభూతుల్లో ఒకరకమైన పరిపూర్ణత్వం సాధించినట్టనిపించడం, మైమరచిపోవడం, విశ్వంతో ఏకమైనట్టు అనిపించడం, అనిర్వచనీయమైన మనశ్శాంతి, అన్నిరకాల భయాలనుంచి విముక్తి పొందిన భావన, అలౌకికానందం, భగవత్స్వరూపాన్ని దర్శించడం వగైరాలుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మెదడులో ఎటువంటి మార్పులు కలుగుతాయో కనిపెట్టడానికి ధ్యానంలో మునిగిన కొందరు బౌద్ధ భిక్షువులపై ప్రయోగాలు చేశారు. వారి మెదడులో నిద్రాణమైన భాగాలు మేలుకున్నట్టూ, పనిచేస్తున్న కేంద్రాలు సుప్తావస్థకు చేరుకున్నట్టూ తెలియవచ్చింది. ఈ ప్రయోగాల ఉద్దేశం దేవుడున్నాడా లేడా అన్నది నిరూపించడం కాదు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న మెదడు పనిచేసే పద్ధతిలో కలిగే మార్పులను పసిగట్టడమే.

దీనికి కారణం ఉంది. మతపరమైన చర్యల్లో ఊహలు ఒక భాగం మాత్రమే. మతాల ఆచరణలో పూజలూ, పునస్కారాలూ, తంతులూ, నైతిక ఆచరణా, సత్కార్యాలు చెయ్యడమూ, ఇతరులపట్లా , సమాజం పట్లా ధార్మిక సద్వర్తనా ఇలా అనేకం ఉంటాయి. ఎటొచ్చీమతవిశ్వాసాలకు బలమైన పునాది ఆలోచనల, భావాలవల్లనే కలుగుతుంది కనక వాటికి గల శారీరిక లక్షణాలను గురించి చర్చించడమే ప్రస్తుత ఉద్దేశం.
ఈ ప్రయోగాలకు గురి అయినవారి మెదడులోని రక్తప్రవాహంలో స్వల్ప మోతాదులో రేడియో ధార్మిక పదార్థాన్ని ప్రవేశపెట్టి దాని ఆచూకీని బైటినుంచి డిటెక్టర్ల ద్వారా కనిపెట్టడం జరిగింది. దీనివల్ల మెదడును "చిత్రీకరించడం" సాధ్యమైంది. ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మెదడు ముందు భాగంలోని ప్రక్రియలు వేగవంతం అయాయి. ఏదైనా పనిమీద మనసుపెట్టినప్పుడు జరిగేదిదే. అదే సమయంలో మెదడుకు పైభాగంలోనూ, వెనకా ఉండే పార్శ్విక, లేదా బహిస్థ (పెరైటల్‌) భాగంలోనూ చర్యలు తగ్గాయి. పరిసరాలను గమనించలేని స్థితిలో ఇదే జరుగుతుంది. ధ్యానంలో నిమగ్నులైనవారికి తమను తాము మరచిపోయినట్టూ, పరిసరాలకూ, స్థలకాలాలకూ అతీతులైనట్టూ అనిపించడానికి కారణం ఇదే. ఈ మార్పులు అనేక పరిశోధనల్లో బైటపడ్డాయి గనక ఆధ్యాత్మిక భావనలకు ముఖ్యకారణాలు ఇవేనని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు.

మెదడులో కొన్ని భాగాలకు చైతన్యం కలిగి, చైతన్యవంతమైన కేంద్రాలు నిద్రాణస్థితికి చేరుకోవడంతో ఆధ్యాత్మిక స్థితిలో అనుభవించిన యదార్థభావన మెలకువగా ఉన్నప్పుడు అనుభవంలోకి వచ్చే యదార్థత కన్నాగాఢమైనదిగా అనిపిస్తుంది. ఇది చాలా బలమైన ప్రభావం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. దైవ ప్రార్థనలవల్ల రోగాలకు ఉపశమనం కలగడమూ, హిప్నోసిస్‌ ద్వారా చికిత్స జరగడమూ వగైరాలన్నీ మెదడులో కలిగే మార్పులతోనూ, పై అంశాలతోనూ ముడిపడినవే. అందుచేత నాస్తికులు దేవుడు లేడని ఒక్కమాటలో కొట్టిపారేస్తున్నపుడు ఆస్తికులకు తమ ప్రగాఢ విశ్వాసానికి అవమానం జరిగిందని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

పరిశోధనలకు లోనయిన బౌద్ధ భిక్షువులు ధ్యానం చేస్తున్నప్పుడు వారి మెదడులో నిజంగానే ఆనందాన్నీ, ఆందోళనకు దూరం కావడాన్నీ, ప్రశాంతతనూ ప్రతిఫలించే మార్పులు కలిగాయని రుజువైంది. ఆధ్యాత్మిక భావాలు లేని మనుషులకు కృత్రిమంగా ఇటువంటి మనస్థితి కలిగిస్తే వారు సరిగ్గా ఇటువంటి భావనలకే లోనవుతారా అని తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. వారిని నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న గదిలో కూర్చోబెట్టి వారి తలలను అయస్కాంతక్షేత్ర ప్రభావానికి గురిచేశారు. ఆ స్థితిలో వారి మెదడులో కలిగే మార్పులు ఆధ్యాత్మిక భావాలను పోలినవా కాదా అని పరిశీలిస్తున్నారు.

సైన్స్‌పరంగా చూస్తే మెదడు విద్యుత్‌రసాయనాలతో (ఎలెక్ట్రో కెమికల్స్‌) పనిచేసే శరీరభాగం. అందుచేత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు అందులో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయో తెలుసుకోవడం శాస్త్రవేత్తల కర్తవ్యం. ఎపిలెప్సీవంటి కొన్ని రకాల మూర్ఛరోగాలవల్లనూ, కొన్ని మాదకద్రవ్యాలవల్లనూ కూడా మతపరమైన భ్రమలు కలుగుతాయని డాక్టర్లకు తెలుసు. మన దేశంలో కొందరు సాధువులూ, బాబాలూ భంగువంటి మత్తు పదార్థాలు సేవిస్తారనేది తెలిసినదే.

దేవుడి గురించిన భావనలకు సాంస్కృతిక, సమాజపరమైన కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతి యుగంలోనూ వివిధ జాతుల, ప్రాంతాలవారికి నిజంగానే ఒకే రకమైన ఆధ్యాత్మిక భావనలు కలుగుతూ వస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇదంతా ఏదో కుట్ర అనీ, అబద్ధాలనీ అనుకోవడం కూడా సబబు కాదు. దీనికిగల భౌతిక కారణాలు మెదడు నిర్మాణంలోనే ఉన్నట్టు కనబడుతోంది. కొందరు శాస్త్రవేత్తలు ప్రస్తుత పరిణామదశలో మనిషి మెదడులో దేవుణ్ణి నమ్మే లక్షణాలు బలంగా ఉన్నాయనీ, ఇప్పట్లో అందులో మార్పు కలిగే పరిస్థితి లేదనీ అంటున్నారు. అంటే దీనర్థం జ్ఞానోదయం కలిగినప్పుడు గౌతమ బుద్ధుడి మెదడుయొక్క పై భాగం సద్దుమణిగిందనా? మోజెస్‌, మహమ్మద్‌ ప్రవక్త తదితరులకు వినిపించిన అశరీరవాణి చిత్త భ్రమేనా? యేసుక్రీస్తు దేవుడితో సంభాషించడం మెదడులో కలిగిన గందరగోళమేనా? దేవుడు మనిషిని సృష్టించాడని నమ్మేవారు మాత్రం దేవుడి గురించిన భావన కేవలం మనిషి మెదడు సృష్టించినదే అంటే ఆగ్రహం చెందుతారు. ఈ చర్చకు స్పష్టమైన వివరణ ఏదీ ఇంకా లభించలేదు కనక మతవిశ్వాసాలు కొందరికి మనశ్శాంతినీ, కొన్ని పరిస్థితుల్లో రుగ్మతల నివారణకూ కూడా ఎలా పనికొస్తున్నాయో, అందుకు దారితీసే ప్రక్రియలు మెదడులో ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి.
"ఇందు" గలడు, "అందు" లేడు

సంప్రదాయవాదుల లెక్కన భగవంతుడంటే విశ్వాన్ని సృష్టించినవాడు. భగవంతుడంటే మానవులకు అలవికాని శక్తులున్నవాడు. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలే తప్ప హేతువాద దృష్టితో విశ్లేషించకూడదు. భగవంతుడి ప్రస్తావన అతి ప్రాచీనమైనది కనక ఈనాటి నాస్తికుల సందేహాలకు అర్థంలేదు. ఈ ప్రతిపాదనలన్నీ తప్పుడువేనని నిరూపించవచ్చు. ఎందుకంటే దేవుళ్ళూ, దేవతలూ, అతీతశక్తుల గురించిన భావనలు ఎటువంటివో, అవన్నీ ఎప్పుడు, ఎందుకు, ఎలా తలెత్తుతాయో ఈ నాడు ఎవరైనా అర్థం చేసుకోగలిగిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా సమాజంలోనూ, చరిత్రలోనూ, విజ్ఞానశాస్త్రపరంగానూ మతవిశ్వాసాల సంకుచితత్వాన్ని గురించి తెలుసుకోవడం కష్టమేమీ కాదు. దేవుడనేవా డున్నాడా అంటే "ఇందు"లోనే, అంటే నమ్మేవాళ్ళ మూఢనమ్మకాల్లో మాత్రమే ఉన్నాడు. మరెక్కడా లేడు. అటువంటి నమ్మకాల గురించీ, మెదడులో కలిగే గందరగోళం గురించీ కూడా ఈనాటి శాస్త్రవిజ్ఞానం వివరించగలుగుతోంది. మొత్తం మీద దేవుడున్నాడనే వాదన రానురాను బలహీనపడుతోంది. ప్రకృతి గురించి అర్థం చేసుకోగలుగుతూ, దాని మీద కొంత ఆధిపత్యాన్ని కూడా చలాయించే స్థాయికి చేరిన ఆధునిక మానవులకు ప్రకృతిలోని మిస్టరీలన్నీ క్రమంగా అవగాహనకు వస్తున్నాయి. మతాలకూ, దైవిక శక్తుల భావనకూ అసలైన మూలాలు ప్రకృతి శక్తుల పట్ల ప్రాచీనులకు ఉండిన భయాల కారణంగానే మొదలయాయి కనక ఈ పరిణామాలు ముఖ్యమైనవి. అంతా మన కర్మ అనుకోకుండా, తమ పంటలు సరిగ్గా పండకపోయినా, బావుల్లో నీళ్ళన్నీ ఎండిపోయినా చదువురాని రైతులు కూడా ఈనాడు విత్తనాల నాణ్యతనూ, భారీ పంపుసెట్లతో భూగర్భజలాలని పీల్చేసే పొరుగు భూస్వాములనూ ప్రశ్నించే స్థితిలో ఉన్నారు. దేవుడి అస్తిత్వానికి ఎదురౌతున్న సవాళ్ళెటువంటివో చూద్దాం.

మొదటిది ప్రకృతి గురించిన అవగాహన. సీదా సాదా వాతావరణ సూచనలూ, పత్రికల్లో వార్తలూ చదివితే "భవిష్యత్తును" గురించి తెలుసుకోవచ్చుననేది మామూలైంది. ఇది ఎందుకు చెప్పాలంటే ఇటువంటి "పరిశీలనలు" జరిపి, రాబోతున్న వరదలను గురించి "జోస్యం" చెప్పిన ప్రాచీన ఈజిప్ట్‌ పూజారులు ఒకప్పుడు చాలా గొప్ప శక్తులున్నవారుగా పేరుపొందారు. ఈరోజుల్లో పరిశీలనలు చాలా ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. భౌతిక, ఖగోళ శాస్త్రాలు నిత్యమూ కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నాయి. లోకాన్ని "సృష్టించినది" ఎవరనే చర్చ మొదలుపెట్టే ముందు అసలు లోకమంటే ఏమిటో ఆధునిక పరిశోధనల వల్ల తెలుసుకోవడం వీలవుతోంది. విశ్వాంతరాళం ఎంత పెద్దదో, బిగ్‌ బేంగ్‌ ఎప్పుడు మొదలైందో శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు. మన పూర్వీకులను భయపెట్టిన ఉల్కలూ, తోకచుక్కలూ, గ్రహణాల వంటి ఖగోళ సంఘటనలు ఎటువంటివో ఈ రోజుల్లో స్కూలు పిల్లలు కూడా చెప్పగలరు. ఎంతో దూరాన ఉండే నక్షత్రాలూ, వాటి గ్రహాలూ, కాంతి కిరణాలూ అన్నీ మనకు తెలిసిన భౌతిక సూత్రాలనే అనుసరిస్తాయి. భూమివంటి గ్రహాల మీద తలెత్తే జీవరాశి అంతా ఈ భౌతిక పరిణామాలకు లోబడి ఉండవలసిందే. ఏ అగ్నిపర్వతమో బద్దలై లావా ప్రవహించనారంభిస్తే పరిసరాలన్నీ మొక్కలూ, ప్రాణులతో సహా కాలి బుగ్గి అయిపోతాయి. భౌతిక, భౌగోళిక పరిస్థితులన్నీ అనుకూలిస్తే తప్ప దేవుడు "బొమ్మను చేసీ, ప్రాణము పోసీ" పెంచిన జీవాలేవీ బతకలేవు. మరొకవంక అణువులూ, పరమాణువులూ, ప్రోటాన్‌, న్యూట్రాన్‌ మొదలైన కణాల అంతర్‌ నిర్మాణమూ వగైరాల సమాచారం కూడా పోగవుతోంది. పదార్థరాశిలో నిక్షిప్తమై ఉన్న బ్రహ్మాండమైన శక్తులు గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కంటికి కనబడని డార్క్‌ మేటర్‌, విశ్వమంతా ప్రసరిస్తున్న న్యూట్రినోలూ వగైరాల గురించి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. విశ్వంలో అక్కడక్కడా కనబడసాగిన బ్లాక్‌హోల్‌ కృష్ణబిలాలు ప్రతి గేలక్సీ కేంద్రంలోనూ ఉన్నట్టుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన ప్రాచీనులు సృష్టి, స్థితి, లయ గురించి స్థూలంగా ఊహించి చెప్పారే తప్ప అంతరిక్షంలోని ఈ వివరాల ప్రసక్తి ఏ పవిత్ర గ్రంథంలోనూ కనబడదు. హిందూమతానికి ప్రత్యేకమైన లోపమేదీ లేకపోవచ్చుగాని, వేదాల్లో అన్నీ ఉన్నాయష అనేది తెలుగువారికి ఒక జోక్‌ అయిపోయింది. మన కేలండర్‌ బొమ్మల మీద కనిపించే దేవుళ్ళే ఇవన్నీ "సృష్టించారని" నమ్మడం ఎవరికైనా నానాటికీ కష్టం అయిపోతోంది. ఆదివారపు ఉదయం సముద్ర తీరాన చర్చికి వెళ్ళిన భక్తులంతా సునామీలో కొట్టుకుపోవడం "భగవదేచ్ఛ" అని నమ్మడం కన్నా, మనుషులతో ప్రమేయం లేకుండా, "ఉద్దేశ" రహితంగా సముద్రగర్భంలో జరిగిన ప్రక్రియల ఫలితమేనని అంగీకరించక తప్పడం లేదు. ఇదంతా కర్మ పరిపాకం అని సరిపెట్టుకోకుండా, అలాంటివి జరిగే ముందే పసికట్టే పరికరాలని అమర్చుకోవడం తెలివైన పని.
చరిత్ర, పురాతత్వ పరిశోధనలవల్ల మతభావనలు ఆటవిక దశలో మనుషులకు ఎలా అలవడ్డాయో చెప్పగలిగే ఆధారాలున్నాయి. పూజారి వర్గాలు ఎలా ఏర్పడ్డాయో, శ్రమ విభజన ఎలా మొదలైందో, సామాన్యులను పాలకవర్గాలు ఎలా అదుపులో ఉంచాయో అన్నీ చెప్పవచ్చు. వేల ఏళ్ళ క్రితం పశ్చిమ యూరప్‌లో కెల్ట్‌ జాతి ప్రజలూ, డ్రూయిడ్లూ, దక్షిణ అమెరికాలో ఇన్కాజాతివారూ,ఇలా ప్రతీ ప్రాంతంలోనూ మతం పేరుతో చిన్నపిల్లలనూ, పెద్దవారినీ కూడా ఎలా బలి ఇచ్చేవారో తెలిపే సాక్ష్యాలున్నాయి. ఇవన్నీ మతాల ఆటవిక మూలాలను సూచిస్తాయి. తరవాతి చరిత్రలో మతాలకి చెడ్డ పేరు తెచ్చే సంఘటనలకు అంతు లేదు. మధ్య యుగాల క్రూసేడ్లన్నీ రాజకీయ కుట్రల, పోరాటాల ఫలితమే. వివిధ మతాల మధ్య అనాదిగా జరుగుతున్న సంఘర్షణలు కాక నిన్నా మొన్నా కేథలిక్‌, ప్రొటెస్టంట్ల మధ్యా, ప్రస్తుతం షియా, సున్నీల మధ్యా జరుగుతున్న పోరాటాలు మతాల మీద సామాన్య ప్రజలకి ఉన్న నమ్మకాలని దెబ్బ తీస్తున్నాయి. భక్తులనబడే వీరందరూ కొట్టుకు చస్తూ ఉంటే భగవంతుడు "కళ్ళూ, చెవులూ మూసుకుని" కూర్చున్నాడని అనుకోవాలి. దేవుడి సంగతి ఎలా ఉన్నా దేవుణ్ణి నమ్మేవారు మాత్రం "కళ్ళూ, చెవులూ మూసుకుని" ధ్యానం చేసుకోక తప్పేట్టు లేదు. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న సంఘటనల్లో మతవిశ్వాసాలని బలపరిచేది ఒక్కటి కూడా ఉన్నట్టు కనబడదు.
సంఘపరంగా మతవిశ్వాసాలు ఒకప్పుడు మనుషులను బలమైన సామూహికశక్తిగా తీర్చిదిద్దినమాట నిజమే కాని, దేవుణ్ణి పాలక వర్గాల తొత్తుగా చేసేశాక అణగారిన వర్గాలకు దేవుడు ఒరగబెట్టినదేమీ లేదు. సమాజంలో నిత్యమూ జరుగుతున్న అన్యాయాలకు అంతు లేదు. డబ్బూ, అధికారమూ ఉన్నవాడికి జరిగే "న్యాయం" అందరికీ వర్తించదు. ఎవెరినైనా తుపాకీతో కాల్చి హత్య చెయ్యబోయిన మనిషి ఏ సినిమా స్టారో అయితే అమలయే చట్టం వేరు. నిరుపేదలకూ, బడుగు ప్రజానీకానికీ రూల్సు వేరు. ఎవరి పాపమూ ఎవరినీ "కట్టి కుడుపుతున్న" దాఖలాలేవీ లేవు. దైవభీతీ, పాప భీతీ ఉండవలసినది అట్టడుగు వర్గాలకే అని అందరికీ తెలిసిపోతోంది. మతానికి ఉన్న రాజకీయ పక్షపాత వైఖరి మనకు కొత్త కాదు. మతపరమైన విషయాలన్నీ సంస్కృతిలో భాగాలైపోయాయి. చిన్న తెగలుగా జీవించినప్పుడు మనుషులను ఏకం చేసిన మతభావనలే ప్రజలను దేశాల, ప్రాంతాల, జాతులవారీగా విభజించడానికి పనికొచ్చాయి. సర్వమానవ సౌభ్రాతృత్వం లేకపోగా మతవిద్వేషాలు ఎన్నో శతాబ్దాల నుంచీ అంతులేని రక్తపాతాన్ని కలిగించాయి. రథయాత్రలూ, బాంబు దాడులూ మతం పేరుతో వివిధ వర్గాలను రెచ్చగొట్టటానికే ఉపయోగపడుతున్నాయి. పవిత్ర గ్రంథాల్లో నీతిసూత్రాలకు పరిమితం అయిన మతబోధనలన్నీ వాస్తవరూపంలో నరరూప రాక్షసులను తయారుచేస్తున్నాయి. ఏది పాపం, ఏది పుణ్యం, ఏ మతం గొప్పదో, ఎటువంటి మతహింస ప్రశంసనీయమైనదో ఏ దేవుడూ చెప్పలేడు. దేశపు సరిహద్దుకు ఇటువైపున ఉన్నవారికి పవిత్రమైన దినాలూ, ఘడియలూ అటు ఉన్నవారికి ఎందుకు వర్తించవో తెలీదు. తప్పనిసరిగా చెయ్యవలసిన పూజలూ, వ్రతాలూ, శాంతులూ, ఉపవాసాలూ, పండగలూ ఒకే దేశవాసులలోకూడా అందరూ పాటిస్తున్నట్టు కనబడదు. దేవుళ్ళ పేరుతో నడిపే ఈ హాస్యాస్పదమైన తంతులన్నీ ఆధునికతను వెక్కిరించేవిగా పరిణమిస్తున్నాయి. బలహీనులను బలవంతులు అణుస్తూ ఉంటే తక్కినవారంతా కళ్ళూ, నోరూ మూసుకుని ఉండటానికి తప్ప ఈ దైవచింతన మరెందుకూ పనికిరావటం లేదు.

జీవశాస్త్రంలో అతివేగంగా జరుగుతున్న పరిశోధనలు మతవిశ్వాసాలకు గొడ్డలి పెట్టు అవుతున్నాయి. పంతొమ్మిదో శతాబ్దంలో సేంద్రియ జీవపదార్థానికీ, రసాయన పదార్థాలకీ సంబంధం ఉందనేది మొదటగా తెలిశాక జీవకణాల సంగతులన్నీ ఒకటొకటిగా బైటపడుతూ వచ్చాయి. ఒక వంక డార్విన్‌ సిద్ధాంతాలవల్ల మనుషులకూ, తక్కిన ప్రాణులకూ ఉన్న సంబంధ బాంధవ్యాలు అవగాహనకు వచ్చాయి. జీవరాశి భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిందో, అందులో ఇంతటి వైవిధ్యం ఎలా ఏర్పడిందో, జీవపరిణామాన్ని భౌతిక పరిస్థితులు ఎన్ని రకాలుగా శాసిస్తాయో అన్నీ శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. జన్యువుల నిర్మాణం ఎటువంటిదో, శరీరలక్షణాలను నియంత్రించే ప్రక్రియలు ఎటువంటివో తెలుసుకున్నాక కొన్ని రోగాలు రాకుండా జన్యుస్థాయిలో మార్పులు చెయ్యడం కూడా ఈనాడు సాధ్యపడుతోంది. కృత్రిమంగా రెండేసి తలలున్న కోడి పిల్లలవంటి వాటిని పుట్టించగలిగే స్థాయికి జన్యుశాస్త్రం ఎదిగింది. రోగాల వ్యాప్తిలో, చావు పుటకలలో జరిగే జీవప్రక్రియలన్నీ తేటతెల్లం అవుతున్నాయి. జీవసృష్టిలో దేవుడి ప్రమేయం ఏదీ లేదని స్పష్టమైపోతోంది.

బాహ్యప్రపంచంలోని వివిధ రంగాలనుంచి దేవుడికి స్థానభ్రంశం కలుగుతూ ఉంటే ఇక ఆస్తికులకి మిగిలిందల్లా తమ మనసులోని భావాలే. ఆధ్యాత్మిక అనుభూతులన్నీ వర్ణించడానికి వీలు కానటువంటివనీ, దేవుడి ఉనికిని నిజంగా గుర్తించగలిగినది భక్తుల మనసేననీ వారు వాదిస్తారు. సైన్సు ఈ ప్రతిపాదనని కూడా కొట్టిపారేస్తోంది. గత పది, పదిహేనేళ్ళుగా మనిషి మెదడు నిర్మాణమూ, అది పనిచేసే తీరూ నిశితమైన పరిశోధనలకు లోనవుతున్నాయి. యదార్థతతో సంబంధం లేని భావాలూ, ఆలోచనలూ ఎటువంటి నాడీ ప్రక్రియలవల్ల తలెత్తుతాయో, "అతీంద్రియ" భావనల లక్షణాలేమిటో, ఏ మనోస్థితిలో మెదడులో ఎటువంటి జీవరసాయనిక ప్రక్రియలు జరుగుతాయో అంతా శాస్త్రవేత్తలకు అర్థమౌతోంది. కృత్రిమ ప్రేరణల ద్వారా మెదడులో ఆధ్యాత్మిక భావనలు కలిగించవచ్చునని నిరూపించడంతో మతాలకు ఆధారమైన భావజాలమంతా కేవలం మెదడులోని నరాల మాయాజాలమే అనేది తెలిసిపోయింది. భక్య్తావేశానికీ, మాదక ద్రవ్యాల ప్రభావానికీ, మూర్ఛ రోగుల లక్షణాలకూ పెద్దగా తేడాలు లేవని స్పష్టమౌతున్న పరిస్థితిలో దేవుడికి మనుషుల మెదడులో కూడా స్థానం లేకుండా పోతోంది.
అయినప్పటికీ మతవిశ్వాసాలను పాలకవర్గాలు పనిగట్టుకుని ప్రోత్సహిస్తూ, సామాన్యులని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. మతాలకి ప్రతీకలైన దేవాలయాలకూ, మసీదులకూ అంతులేని నిధులు సరఫరా అవుతూనే ఉంటాయి. మూఢవిశ్వాసాలదే రాజ్యం. ఈ వ్యవస్థలో బాగుపడుతున్న ఉన్నత వర్గాలన్నీ వీటికి వత్తాసు పలుకుతూ వెనకబడ్డవారికి "మార్గ దర్శనం" చేస్తూ ఉంటారు. గట్టిగా, ఖంగుమని మారుమోగుతున్న అబద్ధాలన్నీ నిజాలుగా చలామణి అవుతూ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని పక్కన పెట్టిన "విద్యాధికు" లందరూ దైవ భజనలు చేస్తూ కాలం గడుపుతారు. కుట్ర పబ్లిక్‌గా కొనసాగుతూనే ఉంటుంది.
చేతబడుల గురించిన నమ్మకాలూ, గ్రామదేవతలకిచ్చే బలులూ మొదలైనవన్నీ పల్లె ప్రజల మూఢవిశ్వాసాలకు ప్రతీకలని ఆధునిక ఆస్తికులకు కూడా అనిపించడం సహజం. భౌతికవాదం ప్రతిదాన్నిగురించీ "ఉన్నదున్నట్టుగా" వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కనబడనివాటిని ఊహించుకుని సంతృప్తి చెందడమో, బెంబేలు పడడమో మనుషులకు ప్రకృతిరీత్యా అబ్బిన ఒక లక్షణం అనుకోవచ్చు. మతాలూ, మూఢనమ్మకాలూ తలెత్తడానికి కారణం అదే.
మంత్రాలూ, చింతకాయలూ


మన దేశంలో ప్రాచీనకాలం నుంచీ మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గురూ, పండిత్‌ వగైరా పదాల్లాగే మంత్రా అనే మాట కూడా ఇంగ్లీష్‌ డిక్ష్‌నరీల్లో కెక్కింది. హిందూ దేవాలయాల్లోనూ, పూజా పునస్కారాల్లోనూ నిత్యమూ వినబడే మంత్రాలే కాక నేపాల్‌, టిబెట్‌ వంటి ప్రాంతాల్లో మంద్రస్థాయిలో బౌద్ధ అర్చకులు ఉచ్చాటన చేసేవీ, చర్చ్‌లూ, మసీదుల్లో ఉచ్చరించే పవిత్ర శబ్దాలూ అన్నీ మొత్తం మీద ఒకే రకం వైఖరికి సంకేతాలు. మనవాళ్ళకి మంత్రాలే కాక వాక్కులోనూ, శబ్దాల్లోనూ కూడా చాలా నమ్మకం ఉంది. వేద పనస కలిసి చదివేది ఇద్దరైనా ఒక్క అక్షరం కూడా, ఒక్క స్వరం కూడా పొల్లుపోకుండా శ్రద్ధగా ఉచ్చరించడం చూస్తాం. మన ప్రాచీన వాఙ్మయమంతా మౌఖికమే. మునులూ, బ్రాహ్మణులూ నోటిమాటగా శాపాలిచ్చేవారు. విశ్వామిత్రుడు రాముడి చెవిలో చెప్పినా, వేములవాడ భీమకవి కోపం వచ్చి తిట్టినా శబ్దాలకు అంతులేని శక్తి ఉందని అనుకోవడం మన సంస్కృతిలో పరిపాటి. రాలని చింతకాయలని చూపించి ఇలాంటి నమ్మకాలని ఎద్దేవా చెయ్యడం సంగతి ఎలా ఉన్నా అసలు ఇలాంటి భావనలకు మూలం ఎక్కడుందో తెలుసుకోవడం అవసరం.

సుదీర్ఘమైన మన చరిత్రలో మతం ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అధికసంఖ్యాకులను అల్పసంఖ్యాక వర్గం అణచి ఉంచడానికి మతాన్ని బాగా ఉపయోగించుకుంది. మతం గురించీ, ఆధ్యాత్మిక విషయాల గురించీ అలౌకికమైన భావాలను పొందేవారికి తమ మెదళ్ళలో ఎలాంటి మార్పులు దేనివల్ల కలుగుతున్నాయో తెలుసుకోలేరు. పుస్తకాలూ, ప్రవక్తల బోధలూ, పెరిగిన వాతావరణమూ అన్నీ మనుషులను మతపరంగా లొంగదీసుకోవటానికి సిద్ధంగా ఉంచుతాయి. వీటికి తోడుగా గుళ్ళలో మోగే గంటలూ, మంత్రోచ్చారణలూ,కలిసి పాడే భజనలూ, తప్పెటలూ అన్నీ ఒకరకమైన హిప్నోసిస్‌కు గురిచేస్తాయి. ఇవన్నీ తరవాతి పరిణామాలు. మానవజాతి చరిత్రలో మొట్టమొదటిది ఒక అమాయకదశ. అతీతశక్తులను గురించి రకరకాల అపోహలు మొదలైన దశ. ఈ అపోహలకు ఎన్నో భౌతిక కారణాలుండేవి. అందులో చెవుల ద్వారా వినబడి మెదడుకు విభ్రాంతి కలిగించే శబ్దాల మాయాజాలం ఒకటి. ప్రకృతిని గురించి ఎక్కువగా తెలియని తొలి మానవులను మభ్యపెట్టే అంశాలు ఎన్నో ఉండేవి. అడవి మృగాల అరుపులూ, కూతలూ, తుఫాను గాలుల రొదలూ, ఉరుముల గర్జనా ఇలా ఒక్కొక్కొదాన్నీ పసికట్టడం వారికి అత్యవసరంగా ఉండేది. ప్రకృతిలో సహజంగా వినిపించే ఇలాంటి శబ్దాలకు అలవాటు పడ్డ తొలి మానవులకు అరుదుగా వినిపించే ప్రతిధ్వనులవంటివి అసహజంగానూ, భయం కలిగించేవిగానూ ఉండేవి. ఇవి ముఖ్యంగా కొండ కనుమల్లోనూ, గుహల్లోనూ వినిపించేవి. వీటివల్ల బెదిరిన మనుషులు వాలా ప్రభావితం అయినట్టుగా అనిపిస్తుంది.
సుమారు 30 వేల ఏళ్ళ క్రితం నుంచి 10 వేల ఏళ్ళ క్రితం దాకా జీవించిన మానవులు ఫ్రాన్స్‌ తదితర ప్రాంతాల్లోని గుహల గోడల మీద అద్భుతమైన బొమ్మలు గీశారు. వీటిలో ఎక్కువగా అప్పట్లో వారు వేటాడిన దున్నలూ, దుప్పులూ, గుర్రాలూ మొదలైనవాటి చిత్రాలు. వీటి సంగతి మొదటగా పంతొమ్మిదో శతాబ్దం చివరి రోజుల్లో తెలిసింది. ఈ బొమ్మలు గీయడానికి కారణాలేమిటో సరిగ్గా తెలియదుకాని ఇటువంటి గుహలు పూజలూ పునస్కారాలూ జరిపేందుకు తొట్టతొలి ఆలయాలుగా ఉపయోగపడ్డాయనే ప్రతిపాదనలున్నాయి. ఈ మధ్య వీటి మీద శబ్దపరమైన పరిశోధనలు జరిగాయి. వాటివల్ల ఈ గుహల్లో కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు బాగా ప్రతిధ్వనిస్తాయని రుజువయింది. ఇవే కాక క్రీ.పూ. మూడు వేలఏళ్ళ నాటి స్టోన్‌హెంజ్‌ మొదలైన ఇతర ప్రాచీన ప్రార్థనాస్థలాల్లో కూడా శబ్దాలు మారుమోగుతాయని తెలిసింది. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోగోరిన పరిశోధకులు వెనకబడిన ఆదిమతెగల్లోనూ, "పురోగమించిన" కొన్ని ఆధునిక సంస్కృతుల్లోనూ ఈనాటికీ కూడా కనబడుతున్న కొన్ని తంతులూ, పూజలను బట్టి ప్రాచీన యుగంలో ఏం జరిగిందో కొంతవరకూ ఊహించగలుగుతున్నారు. గిట్టలు కలిగిన జంతువుల బొమ్మలన్నీ శబ్దాలు మారుమోగే ప్రాంతాల్లోనే ఉన్నాయి కనక బొమ్మలకూ, శబ్దాలకూ సంబంధం ఉండి ఉండాలి. అక్కడ నిలబడి చేతులతో చప్పట్లు చరిచినా, రెండు రాతి ముక్కలతో ఒకదాన్నొకటి కొట్టినా ఆ ధ్వనులు మారుమోగి సరిగ్గా పరిగెత్తే జంతువుల గిట్టల చప్పుడులాగే వినిపిస్తాయి. ఇది కనిపెట్టిన మొదటి గణాచారి ఎవడో తెలియదు కాని దీని ప్రాముఖ్యత వారికి అర్థమై ఉంటుంది. తలవని తలంపుగా ఇటువంటి గుహల సంగతి తెలిశాక అక్కడ మారుమోగిన శబ్దాలు వారికి జంతువుల కాలి గిట్టలను తలపించి ఉంటాయి. అందుకని వారుసరిగ్గా ఇటువంటి ప్రదేశాలనే ఎంచుకుని అక్కడ బొమ్మలు గీశారని అనుకోవచ్చు. గుహలో గుమిగూడి, తమకు ఆహారం అయిన, లేదా కానున్న మృగాలను తలుచుకుంటూ, సామూహికంగా తంతును నిర్వహిస్తున్నఆదిమానవులకు ఇటువంటి చప్పుళ్ళు వింతగా, మాయాజాలంగా, అతీతశక్తులను తలపించేట్టుగా ఉండి ఉంటాయి. ఇది మతానికి అతి ప్రాథమికమైన స్వరూపం. సకాలంలో తగినంత ఆహారం దొరకడం చావుబతుకుల సమస్య అని తెగలోని జనమందరికీ తెలుసు గనక ఇటువంటి ఆచారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండి ఉంటుంది.
కులపెద్దలూ, గణాచార్లూ ఇటువంటి వ్యవహారాలను ముందుండి నడిపేవారని మనం ఊహించవచ్చు. పూనకాలూ, గారడీవంటి విద్యల ద్వారా తెగలోని వారందరినీ ఈ ఆదిమ అర్చకులు ప్రభావితం చేసేవారు. వేట అప్పటివారికి చాలా ముఖ్యం కనక ఇవన్నీ వేటకు సంబంధించిన తంతులుగానే ఉండేవి. ఒకడు దుప్పి వేషమో, దున్న వేషమో వేసుకుని అభినయిస్తే మరికొందరు వాణ్ణి వేటాడినట్టు అభినయించేవారు. ఇటువంటి తంతులు ముఖ్యంగా తెగనంతటినీ ఏకం చేసేవి. కలిసి వేటాడ్డంలోనూ, కలిసికట్టుగా జీవించడంలోనూ ఉన్న లాభాల దృష్య్టా ఇవన్నీ జాతి కొనసాగడానికి తోడ్పడే సంఘటనలే. స్వయంగా వేటలో పాల్గొనలేని చిన్న కుర్రాళ్ళకు ఈ అభినయం పాఠాలు నేర్పేదేమో. తెగలోని స్త్రీలను ఆకర్షించడానికి వేట అభినయం చేస్తున్న యువకులకు అవకాశం లభించేదేమో. మొత్తం మీద తెగలోని వారిని సంఘటితం చెయ్యడానికి ఇటువంటి సమావేశాలు సహాయపడి ఉంటాయి. చీకటి గుహలో కాగడాల వెలుగులో కదులుతున్నట్టుగా అనిపించే జంతువుల బొమ్మలూ, గిట్టలను పోలిన శబ్దాలూ మరింత భ్రాంతిని కలిగించి ఉంటాయి. అలాగే ఒకే శ్రుతిలో మోగే గణాచారి గొంతు ప్రతిధ్వని వల్ల మరింత బలంగా వినిపించి ఉంటుంది. లయబద్ధంగా మోగే డప్పులూ, మళ్ళీ మళ్ళీ ఉచ్చరించే శబ్దాలూ అన్నీ ఒకరకమైన హిప్నొసిస్‌ను కలిగిస్తాయనడంలో సందేహం లేదు. అందరూ కలిసి ఇలాంటి తంతులో పాల్గొంటున్నప్పుడు ఈ వాతావరణం వారి మనసుల్లో ప్రగాఢమైన అనుభూతిని కలిగించి ఉంటుంది. ఇప్పటికీ నలుగురూ చేరి ఏ సత్యసాయిబాబా భజనలో బృందగానంగా పాడుతున్నప్పుడు పూనకం వచ్చినట్టుగా ప్రవర్తించడం మామూలే కనక ఇది ఊహించడం ఏమంత కష్టంకాదు.
నోటి వెంట మంత్రాలను ఉచ్చరించడం మొదలవక ముందే ఆటవికపూజల్లో డప్పుల మోతలు చేసేవారు. లయను అనుసరిస్తూ ఎడతెగక మోగే శబ్దాల కంపనాలు మెదడుపై ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో ఆధునిక పరిశోధకులకు తెలుసు. ఇవి వింటూ ఆటవిక పూజలు చేసే గణాచారులూ, షామాన్లూ ఒక సుప్త చేతనావస్థలోకి వెళతారు. సెకండుకు నాలుగైదు సార్లు మోగే చప్పుళ్ళూ, టిబెటన్‌ బౌద్ధ శ్రమణకులు చేసే ఉచ్చాటనల వంటివన్నీ మెదడును ధ్యానసమాధివంటి స్థితిలోకి తీసుకెళ్ళగలవు. ఈ స్థితిలో మెదడును జోకొట్టే "తీటా" తరంగాలు ఉత్పన్నం అవుతాయి. సెకండుకు 4 7 కంపనాలు కలిగిన ఈ తరంగాలు నిద్రావస్థకూ, మెలకువగా ఉండటానికీ మధ్యస్థమైన భావనను కలిగిస్తాయి. ఈ స్థితిలో మనని ఎంతో గాఢంగా ప్రభావితం చేసే సంఘటనలు జరిగినట్టుగానూ, అతీంద్రియశక్తులు ఆవహించినట్టుగానూ, అస్పష్టమైన భావాలన్నిటికీ అకస్మాత్తుగా రూపం ఏర్పడినట్టుగానూ విచిత్రభావాలు కలుగుతాయి. "పరలోకం"తో సంపర్కం ఏర్పడినట్టు అనిపించడం ఈ స్థితిలోనే జరుగుతుంది. ఇంత గొప్ప "అతీత" భావనలన్నిటినీ కేవలం సెకండుకు నాలుగైదు కంపనాలు కలిగిన శబ్దాల ద్వారా సాధించవచ్చునంటే ఆశ్చర్యమే. అలాగే సెకండుకు 7-12 కంపనాలు కలిగిన ఆల్ఫా తరంగాలు ఎంతో విశ్రాంతిని కలిగిస్తాయి కాని ధ్యానంలో ఉన్నట్టుగా అనిపించదు. మనలోని పూర్తి చైతన్య స్థాయికి దిగువనుండే క్రియాత్మక వైఖరికి ఇవి దారితీయగలవట. సెకండుకు 13-40 కంపనాలు కలిగిన బీటా తరంగాల వల్ల మనస్సు బాగా కేంద్రీకృతం కావడం, దృష్టి నిశితమైనట్టుగా అనిపించడం మొదలైన ప్రభావాలు కలుగుతాయి. సెకండుకు 4 కంపనాల కన్నా తక్కువ ఉండే డెల్టా తరంగాలు గాఢమైన నిద్రకు దారితీస్తాయి. శరీరం కోలుకోవడానికి ఈ స్థితి బాగా ఉపయోగపడుతుంది. ఆల్ఫా, బీటా స్థితుల్లో ఉన్నప్పుడు అయోమయంగా అనిపించిన విషయాలన్నీ తీటా స్థితిలోకి వచ్చినప్పుడు అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది. మెదడు కణాల పొరల (మెంబ్రేన్లు) గుండా స్రవించే సోడియం, పొటాసియం పదార్థాల నిష్పత్తిని నిగ్రహించడం తీటా స్థితిలోనే సాధ్యమైనట్టుగా అనిపిస్తుంది. కంప్యూటర్‌ ద్వారా రకరకాల కంపనాలను సృష్టించి, ఏది మెదడుపై ఎటువంటి ప్రభావం కలిగిస్తుందో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అంచనా కట్టగలరు. రేడియో రిసీవర్‌ను ట్యూన్‌ చేసినట్టుగా ఒక్కొక్క ధ్వనిని బట్టి మెదడులో రకరకాల పరిణామాలు కలిగించగలరు. మెలకువ తీవ్రతరం కావడం, ఆలోచనలు కేంద్రీకృతం కావడం, విశ్రాంతిగా ఉన్న భావనలూ, దృశ్యాలు కనబడడం, విషయాలు జ్ఞప్తికి రావడం, గాఢమైన నిద్ర, నిరాసక్తమైన భావనలూ ఇలా ఎన్నెన్నో మార్పులను అనుకున్నట్టుగా కలిగించే శబ్దాలున్నాయి.
స్టీరియో హెడ్‌ఫోన్ల ద్వారా ఒక్కొక్క చెవికీ వేరు వేరు కంపనాలు కలిగిన శబ్దాలను వినిపించినప్పుడు అవి రెండూ కలిసిపోయి మూడో రకమైన శబ్దం వినిపిస్తుందని పరిశోధనల్లో తేలింది. మెదడులోని రెండు భాగాలు తమకు వినిపిస్తున్న శబ్దాలను కలిపి మరొకరకంగా అన్వయించుకుంటాయి. అనుకంపనంవల్ల మెదడులోని కణాలన్నీ ఈ మూడో శబ్దానికి రెసొనేట్‌ అవుతాయి. వాటివల్ల రకరకాల ప్రక్రియలు మొదలై, ఊహల్లో వివిధ భావనలు కలిగిస్తాయి. మెదడులో రెటిక్యులర్‌ ఆక్టివేటింగ్‌ సిస్టమ్‌ అనే వ్యవస్థ ఒకటి ఉంటుంది. మెదడు కాండంలో ఇది ఒక వలలాగా పరుచుకుని ఉంటుంది. మన చైతన్యాన్నీ, జాగ్రదావస్థనూ, ఏకాగ్రతనూ నిర్ణయించేది ఇదే. శబ్దాలవంటి బాహ్యప్రేరణలకు మనం స్పందించే పద్ధతీ, మన అవగాహనా, నమ్మకాలూ అన్నీ దీనిమీదనే ఆధారపడతాయి. శబ్దాలవల్ల మెదడు కణాల్లో కలిగే మార్పులన్నిటినీ ఈ వ్యవస్థ మామూలు మెదడు తరంగాల రూపంలోనే స్వీకరించి అన్వయించుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించినంతవరకూ ప్రేరణలు ఎటువంటివైనా ఒకటే. సహజంగా మెదడులో కలిగే అనుభూతికీ, కృత్రిమంగా శబ్దాలూ, దృశ్యాల మూలంగా అందే ప్రేరణలకూ గల తేడాలను ఈ వ్యవస్థ గుర్తించలేదు. ఈ వ్యవస్థ వల్ల ప్రభావితం అయే థాలమస్‌ గ్రంథీ, మెదడుపైన ఉండే కార్టెక్స్‌ పొరా వగైరాలన్నీ మెదడులో కృత్రిమంగా ఉత్పత్తి అయిన భావాలను నిజమైనవిగానే గుర్తిస్తాయి. అందుకనే మతపరమైన అతీంద్రియ, అలౌకిక భావనలు పొందినవారికి అవి ఎంతో గాఢంగానూ, తీవ్రంగానూ, స్పష్టంగానూ అనిపిస్తాయి. ఆధునిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి అయిన ఈ రోజుల్లోనే అందరూ ఇలాంటి భ్రమలకు లోనవుతున్నారంటే ఆటవికదశలోని ప్రజలుఎలా స్పందించి ఉంటారో ఊహించుకోవచ్చు.
కేవలం భౌతిక ప్రేరణలవల్ల ఇంతటి మార్పులు జరగగలవని చాలామందికి తెలియదు. అందుచేత ఆలోచనలన్నీ స్వతంత్రంగా మన మనసులో ఉత్పన్నమౌతాయని అనుకునేవారికి ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆదిమయుగంలో ఏ చీకటి గుహలోనో కళ్ళు మూసుకుని కూర్చుని, తప్పెటల మోతలు వింటూ, మంత్రాలవంటి శబ్దాలను ఉచ్చరిస్తూ, వీటివల్ల కలిగే ప్రతిధ్వనులను కూడా వింటూ ఊగుతున్న గణాచారి మెదడులో ఎన్నెన్ని విచిత్ర భావనలు కలిగేవో మనం చెప్పలేం. "ఓం" కారంలోనే సర్వమూ ఇమిడి ఉందని నమ్మబలికే ఆధునిక గణాచారులకూ ఆటవికులలూ ఏమైనా తేడా ఉందా? దొంగ స్వాముల సంగతి ప్రస్తుతానికి వదిలేసినా యాంత్రికంగా మెదడు మీద పనిచేసే శబ్దాల ప్రభావాలను గుర్తించలేక "అలౌకిక ఆనందం" పొందుతున్నామనుకునే అమాయకులను చూసి ఏమనాలి? మతపరమైన భావాలు ఉత్పన్నం కావడానికి శబ్దాలు అనేక కారణాల్లో ఒక అంశం మాత్రమే. దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడు లేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి.
Prosperity confronts poverty
Sri Sri
(Original published in Telugu Swatantra, October 8th, 1954. Translated by Dr. Kodavatiganti Rohiniprasad)
The limping beggar-boy appeared to ride on the back of the evening as he stood in front of the rented premises of “East & West Export Import Company” in the narrow alley. “Ambaa…” shouted the boy.

Deprived of maternal love right from his childhood, the lame beggar-boy had grown up amidst heaps of filth. Even as he stood in front of the office building that traded in everything from the earth to the sky from sunrise to moonset, the boy suffered pangs of hunger that radiated through his frame. His throat managed a half-hearted cry “Ambey…”

The telephones and type-writers that had clattered all day inside the office building remained mute now. The wooden chairs that bore the weight of humans the whole day now seemed to find time to reminisce about their arboreal origins.

The chairs heard the heartrending cry of the limping beggar-boy but couldn’t find voice to tell him that nobody was home. The boy’s cry attracted the attention of a passing cow that paused for a moment to make sure it was not made by its own young calf. Having realized it wasn’t, the intelligent cow walked away, visibly indifferent.

Who’s to tell the boy he would get nothing here? Will the telephones tell him or will the type-writers; that not even a sip of water would be forthcoming from the building where deals worth millions are made routinely. How can the fluttering pages of the calendars hanging on the walls convey this information to the boy?

The lame beggar-boy seemed to forget the only song he knew. His face reflected the ruddy confusion of the setting sun. As he began struggling with rising anxiety and tried to revive his dying hopes, the tremors in the tummy of the lame beggar-boy made his eyes swim. Irrelevant in birth and inappropriate in his miserable youth, the parched tongue of the lame beggar-boy was dangling like the discoloured pennant of a defeated king.

Will the boy stand there for ever? Will this narrative ever move ahead? Will those motionless feet of his strike roots into the ground turning the boy into a tree?

This narrative can go on and on describing the matted hair on the beggar’s head, the wretched contents of the compartment that is his head, the prosperity of the immense riches inside the building in front of him and so forth. One can wax eloquent about the beauty of the narrow lane and the glow of the setting sun with colourful imagery. But the story would remain where it started.

If ever the lame beggar-boy can raise his head and notice the message that the lock on the front of the door would convey, if ever his cry for alms turns into a moan of despair and if ever his feet would realize the futility of standing in front of that building, only then would this narrative end.

Srirangam Srinivasa Rao, popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Telugu people remember Sri Sri as long as Telugu poetry exists. Sri Sri completed his higher studies in Madras and later worked for 'Andhra Prabha' daily, All IndiaRadio and also in the armed forces. Sri Sri revolutionised the style and content of modern Telugu poetry and rendered most of his predecessors and contemporaries outdated. He wrote memorable prose and thundering poetry that always reverberated with his deep commitment to the upliftment of the downtrodden worldwide. With a wide knowledge of progressive and revolutionary literature from every corner of the world, he epitomised the intellectual honesty and fervour of a true peoples' poet. He is widely read, quoted and continues to live in the hearts of Telugu people long after his demise in 1983. He was a poet for the masses and a Mahakavi in the truest sense of the word. The present piece is representative of his prose which is poetical in style.
Poverty
Dr. K. Rohiniprasad

Today we live in a technologically advanced world. We have mastered the science and art of controlling nature as per our convenience. We produce machines that are as intelligent (if not better) as the best of us. We have understood most of the mysteries of life and analysed several natural phenomena. And yet, as a civilization, we have failed simply because we have not been able to banish poverty, misery, wars and worse. More than two thousand years ago, the concepts of democracy and human rights took shape in some parts of our world. Two centuries ago, the French talked of liberty, equality and fraternity. The Soviet system made a bold attempt at forcing the pace of an egalitarian society. And yet, the problems remain as ever and seem to be getting worse by the day.

We have grown immune to the fact that in its most extreme form, poverty is a lack of basic human needs, such as adequate and nutritious food, clothing, housing, clean water, and health services. The poorest amongst us continue to struggle daily for food, shelter, and other necessities. The poor populations of the world include those suffering from destitution or absolute poverty as we occasionally notice in some of the African countries.

What has gone wrong? It is difficult believe that poverty is merely the result of lack of adequate resources such as land, food, and building materials required for the survival of the world’s poorest. It has more to do with the uneven distribution of resources on an international or regional scale. That is why many people have much more than they need to live in comfort, while many others do not have enough resources for mere survival.

One of the excuses for the present sate of affairs is to blame it on the past. The division of a society into a hierarchy of wealth, power, and status began with the earliest civilizations of ancient Egypt, the Middle East, and the Indus Valley. The ruling classes in these civilizations often mistreated the poor, sometimes subjecting them to hard labour or enslaving them. That is why old religious texts often exhort people with resources to treat the poor with compassion. The very existence of poverty is never questioned and the whole stress is on pity, charity and nobility in behaviour.

The so-called rise of civilizations only seems to have made the matters worse. Some of the powerful and wealthy nations maintained and increased their power and wealth and built empires by using the labour and resources of less powerful regions. This inevitably led to colonialism and imperialist ambitions. History was reduced to a series of political and military confrontations among the rich nations while the poorest of the poor continued to languish, irrespective of their geographical location.

It is not that progress has not been achieved. Industrial revolution, the age of mechanization, improvements in atomic science and electronics and the information age have all resulted in tremendous success and made a difference to the lives of those who could afford them. One only has to watch an old Hindi movie of the 1930s or 40s to notice that while the lifestyles of the rich and middle classes have changed tremendously, the condition of the poor peasants and labourers (who appear as walk-on characters) appears to have changed little! The only difference seems to be that today the government can learn quickly where the drought-affected zones in a particular region are located. It is altogether a different matter that nothing is done to remedy the situation. Thus we have all the trappings and talking points of the modern technology but little else beyond paying lip-service to the gargantuan problems of inequity.

The rise in the awareness of human rights has been very slow and mankind could finally banish some of the more abhorrent practices like slavery and unequal civil rights for some races. Even here, glaring errors persist to this day whether it is due to the age-old caste system in India or racial prejudices in the ‘egalitarian’ western societies. Clearly a minority continues to be more equal than the rest of us.
The frequently touted reason for poverty is overpopulation, paucity of jobs, and not enough food. But one can not ignore other factors like the unequal distribution of resources in the world economy, inadequate education and employment opportunities, environmental degradation that is mainly brought about by the rapaciously wealthy nations, and lack of welfare measures. In fact, the present trend is to push more and more sections of society out of the welfare net out into the cold. While such measures win the approval of institutions like the World Bank, the social costs of asking large sections of people to fend for themselves can be tremendous. The rise of criminal elements in Mumbai, for example, is often linked to the closure of mills with the lives of thousands of skilled workers and their families permanently destroyed.

The legacy of colonialism accounts for much of the unequal distribution of resources in the world economy. Some of the wealthier developed countries continue to practice neo-colonialism by adopting trade practices that favour them in the trade with the developing world. Developed countries also continue to get inexpensive natural resources from poorer countries in Asia, Africa, and Latin America, including oil for power, ores and minerals for manufacturing commodities. The low-paid workers in factories operated by multinational corporations represent the new face of slavery or serfdom.

Poverty affects everyone. It not only results in poor nutrition and health problems but also high infant mortality rate and low average life expectancy. Diseases, overcrowding, unhygienic practices, exposure to elements, malnutrition, vitamin and mineral deficiencies, mental illness, and drug dependence are also the direct result of poverty. The rise of crime and violence, lack of education, mental depression, domestic violence are some of the other consequences. These problems are bound to boomerang on the privileged classes as the world shrinks into a global village.

One of the main shifts that can be noticed in society today is the total lack of conscience on the part of the intelligentsia and the middle classes. Caught in the web of media that continue to spin unrealistic dreams of wealth and prosperity, the thinking and chattering classes have forfeited their role s the conscience-keepers of society. The vulgar and irresponsible depths to which some newspapers (some of them are more than 150 years and call themselves ‘leaders’) have sunk appear incredible. The capitalist-consumerist juggernaut tries to sweep everyone off their feet in a desperate attempt to make money out of the miserable urban poor. Even as the masses try to make both ends meet in its daily grind for survival, the media promote acquisitive culture with sex as a powerful motif. The economically and sexually starved millions are left drooling at the mega-billboards and television commercials. If occasionally some of them lose their mental balance and cross the limit, they are caught and punished! The poor and deprived souls are constantly tempted with goodies and at the same time, sermons are preached about self-control and good behaviour. The media assiduously promote pulp culture and the lowest of cultural values. As a result we have millions of neo-illiterates who hardly do anything other than gawk at television screens that dish out socially irrelevant trash. With no value-system to provide moral and social guidance, the poorest of poor turn to crime as a short cut to acquiring wealth. No wonder the President of India recently remarked that most of the prisoners on the death row seem to belong to the economically deprived classes.

Much has been discussed and argued about the various forms of government that can provide the ideal solution to the problems of social inequity. But the inescapable conclusion is that as a species, race and civilization, mankind has failed miserably to achieve even a modicum of decency in treating their fellow-humans. And no one seems to be ashamed of it.